తిరుమలలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పర్యటన
తిరుపతి,జూన్ 10: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నేడు, రేపు తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
నేడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) నిర్వహిస్తున్న స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ హాజరుకానున్నారు. విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయడంతో పాటు విశ్వవిద్యాలయ వర్గాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రేపు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.