చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు
స్టాండింగ్ ఓవేషన్ గౌరవం
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (ఎల్ఎంసీ) ప్రారంభోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రివర్గ సమావేశంలో మంత్రులు అభినందనలు తెలిపారు. గురువారం అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరై క్యాబినెట్ హాల్లోకి అడుగుపెట్టగానే మంత్రులంతా లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. స్టాండింగ్ ఓవేషన్తో సీఎం చంద్రబాబును అభినందించారు. వెలిగొండ, పోలవరం ఎల్ఎంసీ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా రాష్ట్రానికి కీలకమైన జలవనరుల ప్రాజెక్టులు అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొంటూ మంత్రులంతా సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.