దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి
నారా లోకేష్
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన నేపథ్యంలో దళవాయి రమాదేవి కుటుంబసభ్యులతో కలిసి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రమాదేవి చేసిన సేవలను గుర్తించి శాసనమండలి సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు మంత్రి నారా లోకేష్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు, నాయకులను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గుర్తిస్తుందని, వారికి సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని లోకేష్ పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మరింత నిబద్ధతతో పనిచేయాలని రమాదేవికి మంత్రి సూచించారు.