టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు
చిలకలూరిపేట,జూన్ 10: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని పసుమర్రు గ్రామ సమీపంలో బుధవారం కారు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్కు వెళ్తున్న ఓ స్విఫ్ట్ డిజైర్ కారు టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో గాయాలు స్వల్పంగానే ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. టైర్ పేలడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.