నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి,జూన్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించనున్న ఎన్డీయే ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
కేంద్రంలో మోదీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, సుపరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించే అవకాశమున్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించనున్నారు.