రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

మంత్రి తుమ్మల

వరంగల్, జూన్ 2: రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ బలోపేతమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ (ఎనుమాముల) వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్‌గా బండి జనార్ధన్ నియమితులయ్యారని మంత్రి తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, నిల్వ, విక్రయ ప్రక్రియల్లో పారదర్శకత పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 191 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించినట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్ కమిటీల ఏర్పాటులో జాప్యం లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (ఎనుమాముల) మార్కెట్ కమిటీ ఒకటని మంత్రి తెలిపారు. కొత్త పాలకవర్గం స్థానిక రైతుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తూకం, నిల్వ, వేలం ప్రక్రియల్లో పారదర్శకత తీసుకురావడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వ్యవసాయ ఉత్పత్తులకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు మార్కెట్ యార్డుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు ప్రయోజనాల పరిరక్షణ, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ప్రభుత్వ విధానమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.నూతనంగా నియమితులైన చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్‌పర్సన్ బండి జనార్ధన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి అభినందనలు తెలియజేస్తూ, రైతులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
18 వీక్షణలు

ట్యాగ్‌లు

#ministerthummala #warangalmarketcommittee #telangana #agriminister #newmarketcommittee

సంబంధిత వార్తలు

తాజా వార్తలు

రాజకీయాలు

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

భారత్‌లో అత్యాధునిక స్టీల్ ప్లాంట్‌కు రండి

నోవోస్టల్–ఎం చైర్మన్‌కు మంత్రి లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం:

హోంమంత్రి అనిత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

తోత‌పూరి రైతులకు ప్రభుత్వం భరోసా

మంత్రి అచ్చెన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలూరి

ప్రజా సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

తెలంగాణలో జనసేన రాజకీయ పోరాటం: పవన్ కళ్యాణ్

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమన్వయంతో పనిచేయాలి

టీడీపీ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గోదావరి పుష్కరాలు-2027కు భారీ ఏర్పాట్లు

సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం – సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?

ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించం. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ–అసెస్‌మెంట్ నిర్వహించాలి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు. పన్నుల వసూళ్లలో అవకతవకలను సహించం.

రచయిత Venkat Kommineni ·