ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి
రామ్జీ జాబ్కార్డుల పంపిణీ
1 / 3
రైల్వేకోడూరు(తిరుపతిజిల్లా),జూలై2:రైల్వేకోడూరు నియోజకవర్గం ముక్కావారిపల్లె గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీజీ రామ్జీ) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ మిషన్ను దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం విశేషం.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు వీబీజీ రామ్జీ జాబ్కార్డులను ముఖ్య అతిథులు స్వయంగా అందజేశారు. అనంతరం పథకానికి సంబంధించిన సమాచార బుక్లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్, మిషన్ పోర్టల్ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.