గాన కోకిల" మూగబోయింది

జానకమ్మ అస్తమయం

48 వేలకు పైగా గీతాలతో తెలుగు హృదయాలను గెలుచుకున్న గాన సామ్రాజ్ఞి కన్నుమూత మైసూరు: భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయం ముగిసింది. తెలుగు నేల మీద పుట్టి, దక్షిణాది భాషలన్నింటినీ తన గాత్రంతో ఏలిన "గానకోకిల" ఎస్. జానకి (88) శనివారం మైసూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ వర్గాలు తెలిపాయి. రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ విషాద వార్తను ఆమె మనవరాలు అప్సర వైద్యుల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. రేపల్లె నుంచి జాతీయ ఖ్యాతి దాకా 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన సిస్త్లా శ్రీరామమూర్తి జానకి, మేనమామ సూచనతో చెన్నై చేరి సంగీత దర్శకుడు ఆర్. సుదర్శనం వద్ద గాయనిగా తన ప్రస్థానం ప్రారంభించారు. 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విళయాట్టు'తో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, అదే ఏడాది తెలుగులో 'ఎం.ఎల్.ఏ' చిత్రంతో పరిచయమయ్యారు. తొలి ఏడాదిలోనే ఆరు భాషల్లో పాటలు పాడి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆరు దశాబ్దాల అవిరళ గానం 20కి పైగా భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డు స్థాయి ఘనత సాధించిన జానకమ్మ, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ, ఒడియా, తుళు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ వంటి భాషల్లోనూ, ఆంగ్లం, జపనీస్, జర్మన్, సింహళ భాషల్లోనూ తన గాత్రాన్ని వినిపించారు. తెలుగులో 'బావ మరదళ్లు', 'పూజాఫలం', 'బంగారు పంజరం' వంటి చిత్రాల్లోని ఆమె పాటలు నేటికీ ప్రజాదరణ పొందుతున్నాయి. పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ రాజ్‌కుమార్ వంటి దిగ్గజ గాయకులతో ఆమె పాడిన యుగళ గీతాలు చిరస్మరణీయం. 2017 అక్టోబరు 28న మైసూరులో జరిగిన కచేరీతో తన 60 ఏళ్ల సంగీత ప్రస్థానానికి ఆమె విరామం ప్రకటించారు. పురస్కారాల పంట, పద్మభూషణ్ తిరస్కరణ 4 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 33 వివిధ రాష్ట్ర పురస్కారాలు, తెలుగులో 12 నంది అవార్డులు అందుకున్న జానకమ్మకు మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తమిళనాడు ప్రభుత్వం 'కళైమామణి' బిరుదుతో, కర్ణాటక ప్రభుత్వం 'రాజ్యోత్సవ ప్రశస్తి'తో ఆమెను సత్కరించింది. అయితే 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని, "ఆలస్యంగా వచ్చింది, తనకు భారతరత్న దక్కాల్సి ఉంది" అంటూ నిర్మొహమాటంగా తిరస్కరించి సంచలనం సృష్టించారు. సంతాప సంద్రంలో సినీ, రాజకీయ లోకం జానకమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్త ముఖ్యమంత్రి చంద్రబాబు,తమిళనాడు సీఎం, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె గాత్రం లక్షలాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకుందని, ఆమె మృతితో సంగీత ప్రపంచం మూగబోయిందని నేతలు కొనియాడారు. భౌతికంగా జానకమ్మ మన మధ్య లేకపోయినా, ఆరు దశాబ్దాలపాటు తెలుగు ప్రజల గుండెల్లో నిండైన మధురిమలు నింపిన ఆమె గీతాలు తరతరాలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ దివ్య గాత్రానికి అశ్రుతర్పణలు!
215 వీక్షణలు

ట్యాగ్‌లు

#జానకి #singer #janaki

సంబంధిత వార్తలు

సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
సినిమాలు

రంగస్థలం నుంచి వెండితెర వరకు విశిష్ట సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి

భరణి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

సంగీత సరస్వతి బాలమురళి నేడు జయంతి

ఘనంగా నివాళులు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

వెండితెర సుందరి నుంచి వన్యప్రాణి ఫొటోగ్రాఫర్‌గా"సదా"అరుదైన ప్రస్థానం

పులుల ప్రేమలో పడి కెమెరా పట్టిన 'జయం' కథానాయిక

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ముక్కావారిపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి

రామ్‌జీ జాబ్‌కార్డుల పంపిణీ

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

విలక్షణ నటుడు

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·