*రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం*

ఎమ్మెల్యే ఏలూరి

కారంచేడు,జూన్ 16:రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువుల సరఫరాను ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో చేపట్టిందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. పంటలకు అవసరమైన మేరకే ఎరువులు వినియోగించాలని, అధిక మోతాదులో వాడటం వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా భూమి సారవంతత దెబ్బతిని రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో హెచ్‌ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర పురుగు నియంత్రణ (ఐపీఎం) రైతు శిక్షణ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఈ మేరకు మాట్లాడారు.ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఆశాజనకంగా సాగుతోందని, రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేపట్టడం ద్వారా దిగుబడులు పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చని రైతులకు సూచించారు. రైతులు ఎరువులు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏలూరి సూచించారు.సదస్సులో ఏపీఎస్‌ఎస్‌సీఏ డైరెక్టర్ డా. వై. సతీష్, ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల డీన్ డా. చెరుకూరి శ్రీనివాసరావు, ఏఆర్‌డీ ఎన్.వి.ఎస్.ఎస్. దుర్గాప్రసాద్ పాల్గొని సమగ్ర పురుగు నియంత్రణ, పర్యావరణహిత పంట సంరక్షణ, పురుగుమందుల సురక్షిత వినియోగం, డ్రోన్ సాంకేతికత, ఆధునిక వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు.అత్యంత ప్రమాదకర పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని నిపుణులు సూచించారు. రైతుల ఆరోగ్య భద్రతతో పాటు నేల సారాన్ని కాపాడే వ్యవసాయ పద్ధతులపై ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేశారు.కార్యక్రమంలో ఏపీఎస్‌ఎస్‌సీఏ బోర్డు సభ్యుడు మాలేంపాటి సత్యనారాయణ, ఏపీఈవిడీసీ రాష్ట్ర డైరెక్టర్ టి. శ్రీహరి,రోడ్డు రవాణా సంస్థ డైరెక్టర్ కారుమంచి కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్ చిరంజీవి, పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.
226 వీక్షణలు

ట్యాగ్‌లు

#mlayeluri #agriculture #horticulture #aacharyang #rangauniversity #farmers

సంబంధిత వార్తలు

ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*వైద్య సాయమే ప్రాణదానం*

ఎమ్మెల్యే ఏలూరి చొరవతో పేద కుటుంబానికి భరోసా

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

పర్యావరణ హితం.. కలెక్టర్ వినూత్న ప్రయత్నం

ఎలక్ట్రిక్ స్కూటీకి జిల్లా కలెక్టర్ పూజలు

రచయిత Sriram ·
ఆరోగ్యం

సంజీవనిలో డేటా ఇంటిగ్రేషన్‌ కీలకం

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునరుద్ధరణకు

సీఎం చంద్రబాబు పిలుపు

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·