పొగాకు ధర కిలో రూ.200కు తగ్గొద్దు:
సీఎం చంద్రబాబు
1 / 2
అమరావతి,జూన్ 18: రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పొగాకు రైతులు, ట్రేడర్లతో సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొగాకు రకం ఏదైనా కిలో ధర రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ పరిస్థితులు ఉండకూడదని, మార్కెట్కు వచ్చిన పొగాకు బేళ్లు తిరిగి వెళ్లకుండా కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. టొబాకో బోర్డు పరిధికి వెలుపల జరిగే అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొగాకు మార్కెట్ స్థిరీకరణ కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డీవీబీ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, టొబాకో బోర్డు ప్రతినిధులు, పొగాకు రైతులు, ట్రేడర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.