కోహెడ అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

CM revanth

రంగారెడ్డి,జూన్ 6: తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో శనివారం సాయంత్రం అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 240 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని తెలిపారు. రైతులకు భద్రతతో కూడిన ఆధునిక మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారిస్తున్నామని, కందుకూరు ప్రాంతంలో టమోటా ఆధారిత సాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులకు అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని సీఎం తెలిపారు. అలాగే అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఆధునిక సమీకృత కార్యాలయ సముదాయాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా 15 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్, రూ.20 వేల కోట్ల రుణమాఫీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ రాయితీ రుణాలు వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
240 వీక్షణలు

ట్యాగ్‌లు

#internationalfruitmarket #koheda #cmrevanth #agrimministerthummala

సంబంధిత వార్తలు

వ్యాపారం

నాబార్డ్‌ మాజీ ఛైర్మన్‌ పామిడి కోటయ్య కన్నుమూత

బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత శిఖరాలకు

వ్యాపారం

నారా బ్రాహ్మణికి అరుదైన జాతీయ గుర్తింపు

మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

పొగాకు ధర కిలో రూ.200కు తగ్గొద్దు:

సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

పొగాకు కొనుగోళ్లకు ఊపు

మంత్రి అచ్చెన్నాయుడు

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

ఏపీపై రుసాల్ దృష్టి.. భారీ అల్యూమినియం పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

భారత్‌లో అత్యాధునిక స్టీల్ ప్లాంట్‌కు రండి

నోవోస్టల్–ఎం చైర్మన్‌కు మంత్రి లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·