ప్రపంచ రికార్డు విజేత ఈషా సింగ్కు సీఎం రేవంత్ అభినందనలు
హైదరాబాద్,జూన్ 18: ప్రముఖ షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఈషా సింగ్ బుధవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ (MCRHRD)లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల నిర్వహించిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్ (రైఫిల్/పిస్టల్)–2026 పోటీల్లో స్వర్ణ పతకం సాధించడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ఘనంగా సత్కరించి అభినందించారు.
అంతర్జాతీయ వేదికపై అసాధారణ ప్రతిభ కనబరిచి దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఈషా సింగ్ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఈషా సింగ్ సాధించిన విజయాలు భారత క్రీడా రంగానికి మరింత గుర్తింపు తీసుకొచ్చాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు.