తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్
1 / 3
తిరుమల:రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.రైల్వేకోడూరు నియోజకవర్గంలో నిర్వహించిన వీబీజీ - రాంజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, ఆయన నేరుగా తిరుమల వెళ్లి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
వేద పండితుల ఆశీర్వచనం
ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఉప ముఖ్యమంత్రికి ఆశీర్వచనం చేశారు.అనంతరం స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్,అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచి, సాయంత్రం దర్శనానికి వెళ్లారు.
వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు
ఉప ముఖ్యమంత్రితో పాటు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.