బుల్లెట్ ప్రూఫ్ వాహనాలపై ప్రభుత్వం
కీలక నిర్ణయం
హైదరాబాద్:తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ పొందిన పలువురు మాజీ డీజీపీలను ప్రభుత్వం వివిధ పదవుల్లో కొనసాగిస్తున్న నేపథ్యంలో, వారికి ప్రస్తుతం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
26 మంది అధికారులకు వాహనాల తొలగింపు
మాజీ పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు కలిపి మొత్తం 26 మందికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తీసివేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో ఉన్న మాజీ డీజీపీలు:
స్వరజిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేష్ రెడ్డి
జితేందర్, మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ
పూర్ణచందర్రావు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, నవీన్ ఛంద్
డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, డీటీ నాయక్, ఉమేష్ షరీఫ్
రవి గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్
వీరితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్లుగా పనిచేసిన అధికారులకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా పోలీస్ శాఖ వెనక్కి తీసుకుంది.
ఎస్కార్ట్ వాహనాలు, గన్మెన్ల సంఖ్యలోనూ కోత
మాజీ డీజీపీలకు ఉన్న ఎస్కార్ట్ వాహనాలను సైతం పోలీస్ శాఖ ఉపసంహరించుకుంది. అదే విధంగా పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారులకు కేటాయించిన గన్మెన్ల సంఖ్యను కూడా తగ్గించింది.