రాష్ట్రంలో 14 పీఏసీఎస్‌లకు పీఐసీ కమిటీలు

మంత్రి తుమ్మల

హైదరాబాద్,జూలై 2:రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్‌ పర్సన్‌-ఇన్‌-చార్జ్‌ (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీలు ఆరు నెలలపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందైతే అది వర్తించే విధంగా కొనసాగనున్నాయని మంత్రి వెల్లడించారు. నివేదికలో వెల్లడైన లోపాలు... సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్‌, రిజిస్ట్రార్‌ ఆయా సంఘాల పనితీరుపై సమగ్ర పరిశీలన నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో పలు లోపాలు వెలుగులోకి వచ్చాయి: రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం.. ఎగవేతదారుల (డిఫాల్టర్ల) జాబితా తయారు చేయకపోవడం బకాయిల వసూళ్లకు చర్యలు చేపట్టకపోవడం ఆడిట్‌ అభ్యంతరాలను సరిదిద్దకపోవడం నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు గైర్హాజరు పరిపాలనా లోపాలు, సంఘాల ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహారం ప్రస్తుత కమిటీలు ఇదే తీరులో కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాల అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ నేపథ్యంలో నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ (రీఆర్గనైజేషన్‌) ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇది పూర్తయ్యేలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతోపాటు ఇతర సహకార సేవలు నిరాటంకంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ కమిటీల నియామకం అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే సంఘాలకు కమిటీలు?... కరీంనగర్‌ జిల్లాలో మానకొండూరు, తాడికల్‌, మెట్‌పల్లి పీఏసీఎస్‌లు; వరంగల్‌ జిల్లాలో అమీనాబాద్‌, ఖానాపూర్‌, మహ్మదాపూర్‌, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నారావుపేట, గురిజాల, నర్సంపేట పీఏసీఎస్‌లు; వికారాబాద్‌ జిల్లాలో కుల్కచర్ల, పరిగి పీఏసీఎస్‌లకు ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్‌ పీఐసీ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కమిటీలు వెంటనే బాధ్యతలు స్వీకరించి ఆయా సహకార సంఘాల నిర్వహణను పర్యవేక్షించనున్నాయని మంత్రి తెలిపారు. ఉత్తర్వుల అమలుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్‌ & రిజిస్ట్రార్‌ను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.
130 వీక్షణలు

ట్యాగ్‌లు

#agriculture #minister #tummala

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·