రైతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం -
మంత్రి తుమ్మల
10న జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ
- సీఎం రేవంత్రెడ్డి పాల్గొనునున్నారు
ఖమ్మం,జూలై 7: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నట్లు ఆయన వెల్లడించారు.
సభాస్థలిని పరిశీలించిన మంత్రి
సభ నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సభాస్థలాన్ని మంత్రి తుమ్మల పరిశీలించనున్నారు. అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
రికార్డు స్థాయిలో రైతుభరోసా నిధులు జమ
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, రైతుభరోసా పథకం కింద కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో రూ.7,491 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, ఇందుకు నిదర్శనమే ఈ రికార్డు స్థాయి నిధుల విడుదల అని పేర్కొన్నారు. రైతు ఆశీర్వాద సభ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు మరింత అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు.