ప్రధాని మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు
1 / 2
న్యూఢిల్లీ: ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిశారు. సమావేశానికి ముందు జరిగిన ఈ భేటీలో ప్రధానిగా రికార్డు స్థాయిలో 12 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
దేశ అభివృద్ధి, పరిపాలనలో మోదీ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొంటూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగినట్లు సమాచారం.