జగన్నాధపురంలో మెగా రైతు మేళా ను ప్రారంభించిన
మంత్రులు భట్టి, తుమ్మల
1 / 2
మధిర: చింతకాని మండలం, జగన్నాధపురం గ్రామంలో నిర్వహించిన మెగా రైతు మేళాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై, ఆసక్తిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు ఏర్పాటు చేసిన వ్యవసాయ, ఉద్యాన, సాంకేతిక పరికరాలకు సంబంధించిన వివిధ స్టాళ్లను మంత్రులు సందర్శించి, అందులో ప్రదర్శించిన నూతన సాంకేతిక పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, అభిప్రాయాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పంట దిగుబడులను మెరుగుపరచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంచుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేళాలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.