తుంగభద్ర పునరుజ్జీవం - రైతుల సంరక్షణ

33 నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు

హోసపేట,కర్ణాటక:తుంగభద్ర ప్రాజెక్టుకు నూతనంగా ఏర్పాటు చేసిన 33 క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆయా రాష్ట్రాల్లోని నదులను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఒక్కతాటిపైకి తీసుకువచ్చారని ఆయన కొనియాడారు. మూడు రాష్ట్రాల రైతులకు సాగునీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో ఈ గేట్ల పునరుద్ధరణ కీలకమైనదని పేర్కొన్నారు. తుంగా పానం, గంగా స్నానం అనే సామెతను గుర్తు చేస్తూ, తుంగ నది నీరు అంత పవిత్రమైనదని చంద్రబాబు అన్నారు. 2024లో 19వ గేటు కొట్టుకుపోయినప్పుడు స్టాప్‌లాక్ గేటు అమర్చి నీటిని కాపాడామని, నిపుణుడు కన్నయ్య నాయుడు సహకారంతో ఈ ప్రక్రియ విజయవంతమైందని వివరించారు. ఇప్పుడు మళ్లీ 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించామని, ఈ విషయంలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. 1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించిన చారిత్రక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అదే రోజుల్లో ఉమ్మడి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగునీటిని అందించామని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు ఒకేచోట కలవడం చారిత్రాత్మక అంశమని అభివర్ణించారు. తుంగభద్ర నదీ తీరం విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా ఉందని, జోగులాంబ, హంపీ విరూపాక్ష ఆలయం, రాఘవేంద్రుడి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరంలోనే వెలిశాయని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, వన్ నేషన్ వన్ గ్రిడ్, టెలికం, రహదారి నెట్‌వర్క్ వంటి విధానాలతో భారత్ విజయవంతమైన దేశంగా నిలుస్తోందని తెలిపారు. గంగా- కావేరి నదులను అనుసంధానించగలిగితే భారత్ ఇక ఆపలేని శక్తిగా మారుతుందని, కెన్- బెత్వా ప్రాజెక్టు ద్వారా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నదుల అనుసంధానం సాధ్యమైందని గుర్తు చేశారు. గోదావరి- కావేరి నదుల అనుసంధానం ద్వారా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరుతాయని అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో ప్రభావంతో తుంగభద్ర, ఆల్మట్టి జలాశయాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం తగ్గిందని, ఈ ఏడాది నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ఈ నేపథ్యంలో నదుల అనుసంధానం మరింత ప్రయోజనకరమని, ముందుగా అంతర్గతంగా నదులను అనుసంధానించుకుని, ఆ తర్వాత రాష్ట్రాల మధ్య అనుసంధానం చేపట్టాలని సూచించారు. రాష్ట్రాలుగా అందరూ వేర్వేరైనా, దేశంగా అంతా ఒక్కటేనని పేర్కొంటూ, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సారథ్యంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించడం దక్షిణాది రాష్ట్రాల చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. అందరూ కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
144 వీక్షణలు

ట్యాగ్‌లు

#andharapradesh #karnataka #telagana #cm

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·