రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు
సానా,చింతకాయల,భాష్యం
1 / 3
అమరావతి, జూన్ 8: రాజ్యసభ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన చింతకాయల విజయ్,సానా సతీష్,భాష్యం రామకృష్ణ సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి లుపాల్గొన్నారు.
నామినేషన్ దాఖలు అనంతరం వారు మాట్లాడుతూ,పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు,నాయకులకు సముచిత గుర్తింపు ఇవ్వడం టీడీపీ ప్రత్యేకత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘‘కార్యకర్తే అధినేత’’ అనే సిద్ధాంతాన్ని మరోసారి ఆచరణలో చూపించారని పేర్కొన్నారు.
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణలు పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజాసేవా దృక్పథంతో పనిచేసిన నాయకులని కొనియాడారు. పార్టీ కోసం శ్రమించిన వారికి ఉన్నత అవకాశాలు కల్పించడం ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం, విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రయోజనాల సాధనలో, ప్రజల ఆకాంక్షలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించడంలో ఈ ముగ్గురు నాయకులు కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.