ప్రశాంతంగా నీట్–2026 పరీక్ష నిర్వహణ
జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్
చీరాల,జూన్ 21: బాపట్ల జిల్లాలో ఆదివారం నీట్–2026 ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 590 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 523 మంది హాజరై 88.6 శాతం హాజరు నమోదైంది. 67 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 326 మందికి గాను 292 మంది, ఎన్ఆర్ అండ్ పీఎం పురపాలక ఉన్నత పాఠశాలలో 264 మందికి గాను 231 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, పోలీసు బందోబస్తు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర సౌకర్యాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించినట్లు వెల్లడించారు.