పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని

పరిశీలించిన మంత్రి తుమ్మల

ఖమ్మం,జూన్ 26: తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కల్లూరుగూడెం వద్ద కొత్తగా నిర్మిస్తున్న పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ పనులను స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పామాయిల్ సాగు విస్తరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతుండగా, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 70 లక్షల ఎకరాలకు సాగు విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 36 శాతం సాగు విస్తరణతో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దిగుమతి సుంకం పెంపుపై కేంద్రానికి విజ్ఞప్తి వంట నూనెల దిగుమతుల కోసం దేశం ఏటా లక్ష కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచితే దేశీయ రైతులకు మద్దతు ధర మెరుగవుతుందని మంత్రి తుమ్మల వివరించారు. ఈ అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ఇటీవల దిల్లీలో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం టన్ను పామాయిల్ ఫ్రూట్ బంచ్ ధర రూ.23,852గా ఉండగా, దీన్ని రూ.25 వేలకు కనీస గ్యారంటీ ధరగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరినట్లు గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫ్యాక్టరీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు, సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఒక పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ రైతులకు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొణిజర్ల, గద్వాల జిల్లా బీచుపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి, వనపర్తి జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం పురోగతిలో ఉందని వివరించారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు నెలలో రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అండగా ప్రభుత్వం రైతుభరోసా, రైతుబీమా పథకాలతో పాటు ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా పామాయిల్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల తెలిపారు. పది లక్షల ఎకరాలకు సాగు విస్తరిస్తే రాష్ట్రంలో గ్రీన్ కవర్ పెరగడంతోపాటు, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో పామాయిల్ సాగు కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ పంటగా రైతులు పామాయిల్ సాగును చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు.
155 వీక్షణలు

ట్యాగ్‌లు

#minister #agri #tummala #oilform #oilparm

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·