ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు విజయవంతంగా శస్త్రచికిత్స
మూడున్నర గంటలపాటు సర్జరీ..
రెండు భుజాలకూ రొటేటర్ కఫ్ గాయాలు..
తొలుత కుడి భుజానికి ఆపరేషన్
వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి
దశాబ్దకాలంగా నొప్పిని లెక్కచేయకుండా ప్రజాక్షేత్రంలో పర్యటనలు
ముంబయి,జులై 11:
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు శనివారం ఉదయం ముంబయిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.ఆయన రెండు భుజాలకూ రొటేటర్ కఫ్ గాయాలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, వైద్యులు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని సూచించారు. అధికారిక కార్యక్రమాలను ముగించుకున్న అనంతరమే శస్త్రచికిత్సకు సిద్ధమవుతానని పవన్ కల్యాణ్ గతంలోనే వైద్యులకు తెలిపారు.
రెండు భుజాలకూ ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన వైద్యులు, ముందుగా కుడి భుజానికి సంబంధించిన గాయానికి శనివారం ఆపరేషన్ చేశారు. అంతకుముందు రోజు శుక్రవారం అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు. మూడున్నర గంటలపాటు సాగిన ఈ శస్త్రచికిత్స విజయవంతమైనట్లు వైద్యులు వెల్లడించారు. మిగతా భుజానికి రెండు నెలల వ్యవధిలో మరో ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.