తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా
సంజయ్ జాజు నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన (స్పెషల్-ఎ) శాఖ జారీ చేసిన జీ.ఓ.ఆర్టీ.నం.911 (తేదీ: 26.06.2026) ప్రకారం, ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు (RR:1991) జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సంజయ్ జాజు బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ పేరిట, ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ఎం. రాఘునందన్ రావు ఈ నోటిఫికేషన్పై సంతకం చేశారు. ఇది తెలంగాణ గెజిట్ ఎక్స్ట్రా ఆర్డినరీ ఇష్యూలో ప్రచురించబడనుంది.
ప్రొఫైల్ వివరాలు:
పేరు: సంజయ్ జాజు
సర్వీస్: ఐఏఎస్ (1992 బ్యాచ్)
కేడర్: తెలంగాణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా, ఐటీ-కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్కు కేటాయించబడ్డారు.
2014లో డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసుకు వెళ్లి, 2018 వరకు NHIDCL డైరెక్టర్గా, తర్వాత కేంద్ర అదనపు కార్యదర్శిగా సేవలందించారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) కార్యదర్శిగానూ పనిచేశారు.
2024 నుంచి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
దాదాపు 13 ఏళ్లపాటు కేంద్ర సర్వీసులోనే కొనసాగిన ఆయనను, తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సొంత కేడర్కు పంపుతూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, కేంద్రంలో ఆయనకున్న విస్తృత అనుభవం, పరిచయాలే కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాజు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జూన్ 30న సంజయ్ జాజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.