రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలూరి

ప్రజా సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పర్చూరు, జూన్ 3: ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రూ.100 కోట్లకు పైగా వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి అనేక కుటుంబాలకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీజీఎఫ్ కింద రూ.20 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టగా, శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 దేవాలయాల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. వ్యవసాయ రంగాభివృద్ధికి సాగునీటి వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. వరద కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, అలాగే రైతులకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని కోరారు.నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.
157 వీక్షణలు

ట్యాగ్‌లు

#tdpmla #yeluri #parchur

సంబంధిత వార్తలు

రాజకీయాలు

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం:

హోంమంత్రి అనిత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

తోత‌పూరి రైతులకు ప్రభుత్వం భరోసా

మంత్రి అచ్చెన్న

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గోదావరి పుష్కరాలు-2027కు భారీ ఏర్పాట్లు

సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం – సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?

ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించం. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ–అసెస్‌మెంట్ నిర్వహించాలి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు. పన్నుల వసూళ్లలో అవకతవకలను సహించం.

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

కడుపు మంటతోనే రాష్ట్రంలో వైసీపీ కుట్రలు

నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే విద్వేషాలు రగిల్చేలా వైసీపీ వివాదాలు సృష్టిస్తోంది సంక్షేమంలో ప్రజా ప్రభుత్వానికి సాటి లేదు కూటమి వచ్చినప్పటి నుంచి రూ.65,887 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ పీఎం సేతు ద్వారా ఏపీ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ విశాఖ రైల్వే జోన్ తో రాష్ట్ర ప్రజల కల సాకారం తుని పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

తెలంగాణ సీనియర్ వాటర్ పోలో జట్టుకు అనిరుధ్ ఎంపిక

రచయిత Venkat Kommineni ·
వ్యాపారం

భారత్‌లో అత్యాధునిక స్టీల్ ప్లాంట్‌కు రండి

నోవోస్టల్–ఎం చైర్మన్‌కు మంత్రి లోకేష్ ఆహ్వానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించాం:

హోంమంత్రి అనిత

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

తోత‌పూరి రైతులకు ప్రభుత్వం భరోసా

మంత్రి అచ్చెన్న

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

తెలంగాణలో జనసేన రాజకీయ పోరాటం: పవన్ కళ్యాణ్

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై సమన్వయంతో పనిచేయాలి

టీడీపీ శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:

మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

గోదావరి పుష్కరాలు-2027కు భారీ ఏర్పాట్లు

సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రాధాన్యం – సీఎం చంద్రబాబు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?

ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించం. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ–అసెస్‌మెంట్ నిర్వహించాలి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు. పన్నుల వసూళ్లలో అవకతవకలను సహించం.

రచయిత Venkat Kommineni ·