రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి: ఎమ్మెల్యే ఏలూరి

ప్రజా సంక్షేమం–అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పర్చూరు, జూన్ 3: ప్రజా సంక్షేమం, గ్రామీణాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌చార్జిలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి అనేక పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో మెరుగైన రవాణా సౌకర్యాల కోసం రూ.100 కోట్లకు పైగా వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అదేవిధంగా ఆర్‌అండ్‌బీ రోడ్ల అభివృద్ధికి కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఇప్పటివరకు రూ.18 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించి అనేక కుటుంబాలకు అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీజీఎఫ్ కింద రూ.20 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టగా, శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 దేవాలయాల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. వ్యవసాయ రంగాభివృద్ధికి సాగునీటి వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఎమ్మెల్యే తెలిపారు. వరద కాలువల ఆధునికీకరణకు రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, అలాగే రైతులకు సాగునీరు అందించేందుకు రూ.95 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులకు సూచించిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని కోరారు.నియోజకవర్గంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు.
375 వీక్షణలు

ట్యాగ్‌లు

#tdpmla #yeluri #parchur

సంబంధిత వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

దళవాయి రమాదేవికి అభినందనలు తెలిపిన మంత్రి

నారా లోకేష్

రచయిత Venkat Kommineni ·

తాజా వార్తలు

రాజకీయాలు

చంద్రబాబుకు మంత్రివర్గం అభినందనలు

స్టాండింగ్ ఓవేషన్ గౌరవం

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*

దీక్ష విరమించిన రైతులు

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

ఖమ్మంలో క్రిటికల్ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం

ప్రారంభించనున్న మంత్రి తుమ్మల

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

తుదిశ్వాస విడిచిన యోధుడు

రచయిత Venkat Kommineni ·
సినిమాలు

నటుడిగా నలభై ఐదేళ్లు...అభిమానుల గుండెల్లో చెరగని స్థానం

మెగాస్టార్ చిరంజీవి జన్మదినం

రచయిత Sriram ·
రాజకీయాలు

*గుంటూరు ఛానల్‌.. ఏలూరి పట్టుదలతోనే అడుగులు!*

సాంబన్నతోనే సాధ్యం...

రచయిత Venkat Kommineni ·
ఆరోగ్యం

*3 కొత్త పీహెచ్‌సీలు మంజూరు చేయండి*

అసెంబ్లీలో ఎమ్మెల్యే ఏలూరి

రచయిత Venkat Kommineni ·
క్రీడలు

అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి

మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు

క్రీడలు

గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!

పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు

రచయిత Venkat Kommineni ·
రాజకీయాలు

అంగన్‌వాడీ కార్యకర్త నుంచి శాసనమండలి దాకా..

రమాదేవి ప్రస్థానం

రచయిత Venkat Kommineni ·